60 సంవత్సరాల నాటి మాట, మన పెద్దోల్లు తెల్ల పోరగాల్ల బతుకు మనకొద్దు, మనం కూడా మనకు ఒక బుక్కు రాసుకోని, అందులో రాసిన విధంగా బతుకుదాం అని అనుకొన్నారు. అంటే, ఆల్రెడీ జరిగినవి రాస్తే కథ అవుతుంది, జరగనివి రాసి అవి జరిగేలా చెస్తే. కాన్స్టిట్యూషన్ అవుతుంది, అని దీనర్థం. తిక్క నాయాల్లు( ప్రేమతో అన్నా కాబట్టి ఇది బూతు కాదు). అలా అనుకొని రెండు సంవత్సరాలు ఇరగదీసి ఒక 90000 పదాల్ని అతి జాగ్రత్త గా కూర్చి, తాంబూలాలిచ్చాం తన్నుకు చావండి అని మన మీదకు వదిలారు. దీనికి సాక్షులు అలనాటి 271 నియోజకవర్గ పాలకులు. వాల్లందరు తల ఊపి కొంతమంది సంతకాలు కొంతమంది వేలి ముద్రలు వెసాక మన ప్రప్రథమ రాష్ట్ర పతి బాబు రాజెంద్ర ప్రసాద్ గారు కూడా తల ఊపి ఒక సంతకం పెట్టి రాజ ముద్ర వేసారు. దీని తస్సదియ్య , ఇగ సుభం కార్డు వెయ్యొచ్చనుకొంటె, అక్కడక్కడా కొన్ని సవరింపులు చెయదల్చి మన పెద్దొల్లు ఎడిటింగులు చేయబట్రి, (సరిగ్గ చూసుంటె మొత్తం తప్పులే అగుపడేవేమో), ఇప్పటికి 60 సంవత్సరాల పుణ్యకాలం హారతి కర్పూరం అయిపోయె, మధ్యలో మూడొచ్చినప్పుడల్లా చెసిన ఎడిటింగులు మొత్తం 94 అయ్యి కుర్చున్నాయి. దీని సిగ దరగ సంవత్సరాల కన్నా మార్పులు చేర్పులు ఎక్కువైపొయినాయి. అవ్విధమున ముస్లిం సహోదరులకు ఒక ఖురాన్ లాగ, క్రైస్తవులకు(వీల్లు కూడా మన సహోదరులే) బైబిల్ లాగా, హిందువులకు గీత లాగా, ఇగ మిగతా అన్ని సహొదరులకు వారి వారి పున్య గ్రంధాల లాగా, (గమనిక: ఇక్కడ సోదరీమనులను తెలియబర్చక పోవడానికి ఒక కారణం ఉన్నది, నాకు చిన్నప్పటి నుండి మొహం చూసి సోదరి గా సంభొదించాలో వద్దో డిసైడ్ అవ్వడం అలవాటయ్యింది, అందువల్ల సమయాభావం అయినట్టు తెలీయపరుస్తున్నాను, ఈ విషయమందు అన్యధా భావించ కూడదని ప్రార్థన, ఇందులో మీక్కావలసినన్ని శ్లేషార్థములు దొరుకుతాయి). సో ఆవిధముగా మన పున్య పురుషులు అండ్ స్త్రీ లు మన బతుకులు మారుతాయనె సదుద్దేశ్యం తొ రచించిన ఆ పుస్తకం లో అయితే మార్పులు చేర్పులు జరిగాయి గాని, ఎకార్డింగ్ టు మై నాలెడ్జి, మన బతుకులు స్టిల్ ఎక్కడ వేసిన గొంగళి అక్కడె అన్న చందాన మన పాలకుల కళ్ళకు అగుపడక ఎదుగు బొదుగు లేక సంక ___ పోతున్నాయని నా ఉద్దెశ్యం. భారత దేశం వెలిగి పోతోంది అని ఊదర గొడుతున్న నాయకులకు ఆ వెలుగుల వెనుక ఉన్న చీకట్లు గాని, ఆ వెలుగులకు, వెలుగులు కాని జిలుగులకు కారణ భూతమైన రైతన్నల చావు దృశ్యాలు, నాబోటి వారి ఆకలి కేకలు కనపడలేదా. అసలు ఆ వెలుగులన్ని సామాన్యుని గుండె మంటల ఆనవాల్లేనా అని నాకనుమానం.
ఇక మనం గొంతు చించుకొని అరిచే డెమొక్రసి ని నేను కొన్ని ప్రశ్నలు అడుగ దల్చాను.
1. అయిదు సంవత్సరాల కొకసారి జరిగె ఎన్నికల్లొ ముప్పాతిక భాగం నియోజక వర్గాల్లో పోలైన వోట్లు 30-40% మాత్రమె ఉంటున్నాయి, మిగతావాల్లకు ఈ వ్యవస్థ(ప్రజాస్వామ్యం) మీద నమ్మకం లేదా ?.
2. దేశాన్ని ఏలడానికి నేరస్థులు తప్ప ఇంకెవరూ దొరకలేదా?
3. వాక్స్వాతంత్రపు హక్కునిచ్చిన ప్రభుత్వం, ఏలికల నిస్సిగ్గు తొ కూడిన కీచక పర్వాలను సమాజానికి భహిర్గతం చేసినపుడు న్యాయస్థానం రూపం లో నిజం నాడిని ఎందుకు నొక్కింది(తివారి పర్వం)?.
4. కుల మత వర్గ ప్రాంత విభెదాలు లేకుండా అందరిని సమానంగా చూడలన్న బుక్కు(60 ఇయర్స్ ఒల్డ్), ప్రజల స్తితి గతులను తేల్చడానికి అవే కులాన్ని, మతాన్ని, ప్రాంతాన్ని ఎందుకు ప్రాతిపదికగా తీసుకొంటొంది (దయచేసి వ్యక్తిగతంగా ఈ వ్యాఖను తీసుకొవద్దు).
5. వాల్లు రాసిన బుక్కు మన బతుకుల్లొ తెచ్చిన మార్పుని 60 సంవత్సరాల నుండి ఇప్పటి దాకా లెక్క వేస్తె ఇంకెన్ని సంవత్సరాలు/యుగాలు కావాలి?.
అదీ అలా అడుగు అని చంకలు గుద్దుకోకండి, కింద ఉన్న ప్రస్నావళి పుజ్యులైన గౌరవ భారతీయులమైన మనకు (మీకు +నాకు).
1. 40 కోట్లు పెట్టి సినిమా తీస్తే 100 రొజులు కూడా కాకనే 100 కోట్లు గ్రాస్ రాబడుతున్నాం, బీద అరుపులు అరిచే మనకు ఇదెలా సాధ్యం?.
2. రెండు మూడు గంటలు క్రికెట్ ఆడి నందుకు వందల కోట్లు చేతులు మారుతున్నాయి, దీనికి కారణం వీరభక్తులమైన మనం వెర్రి ముదిరినట్టు సమయం తో పాటు సర్వం క్రికెటార్పణం చెయ్యడమెనా?
3. పనెగ్గొట్టడానికి అయిన్ స్టీన్ లెవల్లొ ఆలోచించే మనం ఓటు వెయ్యాలంటె ఎందుకేడుస్తాం?
4. ఒకరి బాగు ఒకరు కోరాల్సిన మనం ఎందుకు మా భాష, మా రాష్ట్రం, మా కులం, మా ప్రాంతం, అని కొట్టుకు చస్తాం.
5. ఒక పక్క జి డి పి పెంచాలని ఆ తలపాగాయనా, పంచెకట్టాయన తల బాదుకొంటుంటె , బస్సులు తగులబెట్టి, నాన హంగామ చేసి అందర్ని ఎందుకు హడలు గొడుతున్నాం, మనమెమీ కిష్కిందకు వెల్లి నాశనం చేయట్లేదే?
6. దేశ భక్తి పేరుతో ఎందుకు ఆత్మార్పణం చేసుకొని కన్న వాళ్ళకు గుండె కాల్చి ఉన్న ఊరికి మంటపెడుతున్నాం, స్వాతంత్య్ర పోరాటం లో ఎంతమంది వీరులు పోరాటం జరుపకుండా ఆత్మ హత్యలు చేసుకొన్నారు, మరి మనది దేశ భక్తా అలా చెప్పబడిన పిరికితనమా ?.
టైం దొరికినప్పుడు తీరిగ్గా పై వాటికి సమాధానం వెతుక్కోండి..
ఇక ప్రస్తుతానికి సెలవు తీసుకొంటూ
రాజు.
